GOOD NEWS: రైతుబంధు డబ్బులు పడ్డాయ్..

GOOD NEWS: రైతుబంధు డబ్బులు పడ్డాయ్..

తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది తెలంగాణ ప్రభుత్వం.  యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు జమచేసినట్లు మంత్రి హరీశ్‌ రావు అన్నారు.  తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో 607 కోట్ల రూపాయలు జమ చేసినట్లు హరీష్ రావు ట్వీవ్ చేశారు. ‘యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21, లక్షల 2 వేల 8 వందల 22 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో 607.32 కోట్లు జమ చేయబడ్డాయి’ అని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *